ఏపీలో ర్యాగింగ్ కలకలం.. ఒళ్లు కమిలేలా విద్యార్థిని కొట్టిన సీనియర్లు

by Disha Web Desk 19 |
ఏపీలో ర్యాగింగ్ కలకలం.. ఒళ్లు కమిలేలా విద్యార్థిని కొట్టిన సీనియర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని నిట్‌లో ర్యాంగింగ్ కలకలం రేపింది. ఓ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ పేరుతో చితకబాదిన ఘటన శుక్రవారం వెలుగుజూసింది. బాధితుడి వివరాల ప్రకారం.. 'రాత్రి 11గంటలకు రూంకు రావాలని సీనియర్లు ఫోన్ చేశారు. వారి రూంకు వెళ్లగానే మోకాళ్లపై కూర్చోబెట్టారు. నాలుగు గంటల పాటు చితకబాది, రక్తం వచ్చేలా దాడి చేశారు.' అని బాధితుడు వాపోయాడు. అంతే కాకుండా సీనియర్లు డబ్బులు కూడా అడిగినట్లు బాధిత విద్యార్థి జయకిరణ్ తెలిపాడు. సీనియర్లతో ఎలాంటి గొడవలు లేవని.. కేబుల్ వైర్‌తో ఒళ్లు కమిలేలా కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాళ్లతో తన్నుకుంటూ.. చెప్పులతో కొడుతూ చిత్రహింసలకు గురి చేశారని విద్యార్థి చెప్పాడు. అనంతరం బాధిత విద్యార్థి బంధువు మురళీకృష్ణ మాట్లాడుతూ.. జయకిరణ్‌ను చితకబాది వారు పైశాచిక ఆనందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి తర్వాత జయకిరణ్ భయపడి విషయం ఎవరికీ చెప్పలేదని.. ఇంతటి భయంకరమైన ర్యాగింగ్ ఎప్పుడూ చూడలేదని తెలిపాడు.


Next Story