పీడీఎస్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు

by Ratna Kumari |

అక్రమంగా తరలిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రాజాపేట ఎస్‌ఐ లింగారెడ్డి ఆదివారం తెలిపారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు
X

దిశ, రాజాపేట : అక్రమంగా తరలిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు రాజాపేట ఎస్‌ఐ లింగారెడ్డి ఆదివారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, రాజాపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో TS 30 T 2715 నంబర్ గల నాలుగు చక్రాల వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు 44 సంచులు (26 క్వింటాళ్లు), పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, రేణుకుంట గ్రామానికి చెందిన బొద్దుల జగదీష్ పై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపారు

Next Story