సేవే లక్ష్యంగా సర్పంచ్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటో సౌకర్యం

by Batti.Sumithra |

ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామం పరిధిలోని వడ్డెర కాలనీ, తాండా వాసుల విద్యార్థుల కోసం గ్రామ సర్పంచ్ తోగర్ల భూషణ్ స్వయంగా తన సొంత ఖర్చులతో ఆటో వాహనాన్ని ఏర్పాటు చేశారు.

సేవే లక్ష్యంగా సర్పంచ్ ముందడుగు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటో సౌకర్యం
X

దిశ, ఆలూర్ : ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామం పరిధిలోని వడ్డెర కాలనీ, తాండా వాసుల విద్యార్థుల కోసం గ్రామ సర్పంచ్ తోగర్ల భూషణ్ స్వయంగా తన సొంత ఖర్చులతో ఆటో వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తోగర్ల భూషణ్ మాట్లాడుతూ ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థులను సురక్షితంగా, సమయానికి స్కూల్‌కు చేరవేసే విధంగా ఈ ఆటో సేవను ప్రారంభించామని, విద్యార్థుల విద్యాభివృద్ధి దృష్ట్యా రవాణా సమస్యలు ఎదురుకాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం అందరి బాధ్యత అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు వడ్డెర కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Next Story