స్వరాష్ట్రంలో ఫార్మాసిస్టులకు అన్యాయం: ఫార్మసీ సోసైటీ ప్రెసిడెంట్

by Disha Web Desk 13 |
స్వరాష్ట్రంలో ఫార్మాసిస్టులకు అన్యాయం: ఫార్మసీ సోసైటీ ప్రెసిడెంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఫార్మాసిస్టులకు రెగ్యులర్​రిక్రూట్​మెంట్లు, ప్రమోషన్లు లేవని తెలంగాణ ఫార్మసీ సోసైటీ ప్రెసిడెంట్​ డా ఆకుల సంజయ్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్​లోని నిజాం కాలేజీలో జరిగిన రాష్ట్ర వ్యాప్త ఫార్మాసిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా సంజయ్​మాట్లాడుతూ.. ఫార్మసీ కౌన్సిల్​ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది ఫార్మసిస్టులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు రెండు చొప్పున 33 జిల్లాలకు 66 ఫార్మసీ ఇన్​స్పెక్టర్లు, ఖాళీగా ఉన్న 13 డ్రగ్​ఇన్​స్పెక్టర్ ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్​చేశారు.


ఫార్మసిస్టులకు కనీస వేతనం రూ. 30 వేలు ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన​అవసరం ఉన్నదన్నారు. దీంతో పాటు మెడికల్​షాపులు స్థాపించేందుకు క్వాలిఫైడ్​ ఫార్మసిస్టులకు ప్రభుత్వం రూ. 5 లక్షల లోన్‌ల రూపంలో సాయం చేయాలన్నారు. ఫార్మ స్యూటికల్​కంపెనీని స్థాపించడానికి ఫార్మసిస్టులకు రూ. కోటి వరకు లోన్‌లు ఇవ్వాలన్నారు. అంతేగాక ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ అసోసియేషన్​నాయకులు చంద్రశేఖర్​ఆజాద్, వీరారెడ్డి, తిరుమల్​రావు, చారి, నరేష్, సాకేత్​తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed