విద్యార్థులచే పారిశుద్ధ్య పనులా..?

by Disha Web Desk 12 |
విద్యార్థులచే పారిశుద్ధ్య పనులా..?
X

దిశ, మనోహరాబాద్: వేలాది రూపాయలు ఫీజులు దండు కుంటు ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులచే పారిశుద్ధ్య పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. మండల కేంద్రమైన మనోహరాబాద్ లో ఉన్న జె ఎం జె ప్రైవేటు పాఠశాలలో గురువారం విద్యార్థులచే యాజమాన్యం పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తను వూడ్చి వేస్తూ చెత్త వాహనాలలో ఎత్తి పోస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెల ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యం పాఠాలు బోధించడం పోయి ఇలా పారిశుద్ధ్య పనులు చేయించడం సరికాదని హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed