- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సెట్లో కన్నీరు పెట్టుకున్న మెగా హీరో.. వీడియో వైరల్
by Disha Web Desk 17 |
X
దిశ, సినిమా: మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పాడు. బైక్ యాక్సిడెంట్ గాయాల నుంచి కోలుకొని ఎట్టకేలకు సెట్స్లోకి అడుగుపెట్టిన హీరో.. 'SDT15' సినిమా షూటింగ్ను లాంఛనంగా ప్రారంభించినట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇందులో మూవీయూనిట్ సాయి ధరమ్కు ఘనస్వాగతం పలికింది. ఈ క్రమంలోనే అందరికీ చేతులెత్తి నమస్కరించిన హీరో తనపై కురిపిస్తున్న అభిమానాన్ని చూసి భావోద్వేగానికి గురవడం చూడొచ్చు. ఇక ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బీవీఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కార్తీక్ దండు దర్శకత్వం వహించనున్నారు. కాగా సాయి ధరమ్ ఎమోషనల్ అయిన వీడియోపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. తమ అభిమాన హీరోను మళ్లీ ఇలా చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story