సమ్మె విరమిస్తున్నాం : ఆర్టీసీ JAC

by Muthe.Rajitha |

ఆర్టీసీ జేఏసీ (JAC) మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో, సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు అధికారికంగా ప్రకటించారు.

సమ్మె విరమిస్తున్నాం : ఆర్టీసీ JAC
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ (TSRTC) సమ్మె ఎట్టకేలకు ముగిసింది. ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ (JAC) మధ్య జరిగిన చర్చలు ఫలించడంతో, సమ్మెను విరమిస్తున్నట్లు జేఏసీ నాయకులు అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 22న ప్రారంభమైన నిరవధిక సమ్మె, ఏప్రిల్ 24 సాయంత్రానికి ముగిసింది. ప్రభుత్వంతో కుదిరిన ప్రాథమిక ఒప్పందం మేరకు జేఏసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్‌సీ (PRC), గుర్తింపు సంఘాల ఎన్నికలు, ఖాళీల భర్తీ వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం సానుకూల సంకేతాలు ఇవ్వడమే కాకుండా, కొన్ని డిమాండ్లపై వ్రాతపూర్వక హామీని ఇచ్చింది. నేటి నుంచి బస్సులు యథావిధిగా రోడ్డెక్కనున్నాయి.

Next Story