RS Praveen Kumar: బాసర త్రిబుల్ ఐటీ విద్యార్థులను పరామర్శించిన RSP

by Dishanational2 |
RS Praveen Kumar Visited Basara IIIT Students
X

దిశ ప్రతినిధి నిజామాబాద్: RS Praveen Kumar Visited Basara IIIT Students| ఫుడ్ పాయిజన్‌తో నిజామాబాదులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న త్రిబుల్ ఐటీ విద్యార్థులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాసర విద్యార్థులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం యూనివర్సిటీలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. భోజన కాంట్రాక్టులన్నీ టీఆర్ఎస్‌కు సంబంధించిన వాళ్ళేనని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు , కేసీఆర్‌తో ములఖత్ అయ్యాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు లేవని ప్రతిపక్షాలు ఉంటే ఈ పరిస్థితి ఉండదని అన్నారు. గతంలో కూడా ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాసర త్రిబుల్ ఐటీనీ పట్టించుకోలేదని అన్నారు. విద్యార్థుల డిమాండ్లను ఎగతాళి చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: బాసర IIIT ఘటన: రెండు మెస్‌లపై కేసులు నమోదు



Next Story

Most Viewed