ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు!

by Web Desk |
ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు!
X

న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలం -2022పై టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన వేలం పాటలో ఉతప్ప ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. 'వేలం ప్రక్రియ అనేది చాలా ఏళ్ల కిందట రాసిన పరీక్షలా ఉందని, సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు ఆటగాళ్లను కొనడం బాలేదని' సీనియర్ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేలానికి బదులు డ్రాఫ్ట్ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed