అబ్దుల్లాపూర్ మెట్‌లో దొంగల హల్‌చల్

by Jakkula.Mamatha |

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బీభత్సం సృష్టించారు.

అబ్దుల్లాపూర్ మెట్‌లో దొంగల హల్‌చల్
X

దిశ, అబ్దుల్లాపూర్ మెట్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా మూడు షాపుల్లో చోరీకి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. చెరుకు రమేష్ ఇస్తారాకుల షాపు యొక్క పైకప్పు రేకులు విరగొట్టి సుమారు రూ.2000 చోరీకి పాల్పడ్డారు. అలాగే కుమార్ బేకరీ వెనుక భాగం నుండి డోర్ విరగొట్టి షాప్ లో సామాన్లు చెదరగొట్టారు. మంజుల కిరాణం జనరల్ స్టోర్ పై కప్పును చెట్టు పై నుండి ఎక్కి విరగొట్టడం జరిగింది. ఈ విషయం పై సబ్ ఇన్‌స్పెక్టర్ మాధవరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు కనబడినయెడల పోలీస్ 100 డయల్ చేయవలసిందిగా స్థానికులకు తెలియజేశారు.

Next Story