- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రెండు లారీలు ఢీ.. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు
దిశ, పరిగి: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చన్గొముల్ ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్జిల్లా పరిగి డివిజన్ పూడూరు మండలం మిర్జాపూర్గేటు సమీపంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. మన్నెగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని, హైదరాబాద్వైపు నుంచి మన్నెగూడ వైపునకు వస్తున్న మరో లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ.. ఢీ కొట్టాడు.
ఈ ప్రమాదంలో బాలానగర్కు చెందిన వెంకటేష్ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి పూడూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడు మహమ్మద్ గౌస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా లారీ నడిపిన రాత్లావత్ రాము పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపారు.