రెండు లారీలు ఢీ.. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు

by Disha Web Desk 13 |
రెండు లారీలు ఢీ.. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు
X

దిశ, పరిగి: ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చన్గొముల్ ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్​జిల్లా పరిగి డివిజన్ పూడూరు మండలం మిర్జాపూర్​గేటు సమీపంలో సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి. మన్నెగూడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీని, హైదరాబాద్​వైపు నుంచి మన్నెగూడ వైపునకు వస్తున్న మరో లారీ డ్రైవర్​ నిర్లక్ష్యంగా నడుపుతూ.. ఢీ కొట్టాడు.


ఈ ప్రమాదంలో బాలానగర్​కు చెందిన వెంకటేష్​ కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షి పూడూర్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడు మహమ్మద్ గౌస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా లారీ నడిపిన రాత్లావత్ రాము పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాసుల శ్రీశైలం తెలిపారు.



Next Story

Most Viewed