తిరుపత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

by Disha Web Desk 12 |
తిరుపత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపత్తూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంబూర్-వేలూరు హైవేపై లారీ వ్యాన్ ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో 10 మంది తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. మృతులు షూ కంపెనీ కార్మికులు గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story