HYDలో కరీంనగర్ ఘటన రిపీట్.. నిద్రలోనే అనంతలోకాలకు

by Dishanational2 |
HYDలో కరీంనగర్ ఘటన రిపీట్.. నిద్రలోనే అనంతలోకాలకు
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. కరీంనగర్‌లో జరిగిన ఘటన మర్చిపోకముందే నగరంలోని పేట్ బషీరాబాద్‌లో మరో ఘటన జరిగింది. నిద్రపోతున్న కుటుంబం పై నుంచి అతివేగంగా వస్తు్న్న లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతులు బీహార్‌కు చెందిన చందన్ రామ్ (23), చందన్ కుమార్(23)‌గా గుర్తించారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వార్తకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed