- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టిఫిన్ చేద్దామని వెళ్తూ.. మృత్యుఒడిలోకి..
దిశ, కంది: రోజువారీగా కూలి పని చేసుకునే ఓ వ్యక్తి కాస్త కడుపులో ఆకలిగా ఉండటంతో టిఫిన్ చేద్దామని వెళ్తూ.. ఓ వ్యక్తి మృత్యుఒడిలోకి వెళ్ళిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన బోడు పర్ధాని(55), దుక్కి శ్యామ్ భరాతిలు సంగారెడ్డి మండలం దాసు గడ్డ తండాలోని సుభాష్ కు చెందిన ఇటుక బట్టీలో ఉంటూ పని చేస్తున్నాడు.
కాగా గురువారం ఉదయం సదాశివపేట మండలం ఆరూర్లో ఇటుక అన్లోడ్ చేసి అదే టిప్పర్ లారీలో వస్తు మార్గమధ్యలో మామిడిపల్లి శివారులో గల తిలోత్తమ గార్డెన్ వద్ద టిఫిన్ చేయడానికి దిగాడు. ఈ క్రమంలో అవతలి వైపు రోడ్డు దాటుతుండగా అదే సమయంలో సంగారెడ్డి వైపు నుండి హైదరాబాదు వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఇతన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బోడు పర్ధానికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా దుక్కి శ్యామ్ భరాతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మృతిని బంధువైన లోచన్ పర్దాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.