నెట్ ప్రాక్టీస్‌లో ఐపీఎల్‌-2022 ఎలా ఉండబోతుందో చెప్పేసిన.. రిషభ్ పంత్

by Disha Web Desk 13 |
నెట్ ప్రాక్టీస్‌లో  ఐపీఎల్‌-2022 ఎలా ఉండబోతుందో చెప్పేసిన.. రిషభ్ పంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ప్రారంభం కావడానికి ముందే ఎలా ఉండబోతుందో.. రిషభ్ పంత్ తన నెట్ ప్రాక్టీస్‌లో చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఢిల్లీ ఫ్రాంఛైజీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియోలో ఢిల్లీ​ క్యాపిటల్స్‌ కెప్టెన్‌, టీమిండియా స్టార్‌ ప్లేయర రిషభ్ పంత్ తనదైన శైలిలో వరుస షాట్లతో చెలరేగిపోయాడు.


ఈ క్రమంలో పంత్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. యువ ఆటగాళ్లు యశ్‌ ధుల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, కమలేష్‌ నాగర్‌కోటి అలా చూస్తూ ఉండిపోయారు. యువ ఆటగాళ్లు పంత్ షాట్లను గమనిస్తూ ఉండిపోయారు. కాగా మార్చి 26 నుంచి క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌ ఆరంభం కానుంది. ఇక ఢిల్లీ.. మార్చి 27 న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్‌ను ఆరంభించనుంది.

Next Story

Most Viewed