భద్రాద్రిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ.. హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే పాయం

by Dishanational2 |
భద్రాద్రిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ.. హాజరు కానున్న మాజీ ఎమ్మెల్యే పాయం
X

దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అన్నారం గ్రామంలో శ్రీశ్రీ శ్రీ సీతారామ అభయాంజనేయస్వామివిగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు అన్నారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఆహ్వానం పలికారు. ఆదివారం అన్నారంలో శ్రీశ్రీ శ్రీ సీతారామ అభయాంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టించి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ సీతారామ అభయాంజనేయ స్వామి విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠకు ఆలయ కమిటీ సభ్యులు పిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. సీతారామ అభయాంజనేయస్వామి అన్నారం గ్రామ ప్రజలందరినీ చల్లంగా చూడాలని ఆయన కోరారు. సీతారామ అభయాంజనేయస్వామి ఆలయానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని ఈసందర్భంగా తెలిపారు. ఈకార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వరరావు,సమితిసింగరం ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్,ఉపసర్పంచ్ తరుణ్ రెడ్డి,పిల్లారిశెట్టి హరిబాబు,మాదాడి రాజేష్,పల్లపు తిరుమలేష్,బల్లెం సురేష్,కటుకూరి శ్రీనివాసరావు,పునేం చంద్రశేఖర్, మహబూబ్ పాషా,కొండేరు ఉపేందర్,బత్తుల శ్రీను,బెక్కం తిరుమలరావు,కొరస నవీన్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed