భూ ఆక్రమణను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

by Batti.Sumithra |

మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 20లో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నించడంతో మంగళవారం మండల రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు మండల తహసీల్దార్ రామచందర్‌రావు తెలిపారు.

భూ ఆక్రమణను అడ్డుకున్న రెవెన్యూ అధికారులు
X

దిశ, హాలియా : మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం వద్ద సర్వే నంబర్ 20లో ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది ప్రయత్నించడంతో మంగళవారం మండల రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు మండల తహసీల్దార్ రామచందర్‌రావు తెలిపారు. గ్రామంలోని సర్వేనంబర్ 20లో కొంత భూమిని ఇందిరా క్రాంతి పథకం కింద పెట్రోల్ పంపు ఏర్పాటుకు కేటాయించినట్లు తెలిపారు. అట్టి భూమిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించే ప్రయత్నం చేయగా, పోలీసుల సహకారంతో వారిని అడ్డుకొని ఆ స్థలానికి కంచె ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ నవీన్‌కుమార్, స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Next Story