రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్..

by Disha Web Desk 19 |
రాష్ట్రంలోని ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్..
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. దీనికి సంబంధించి ఉన్నత విద్యా మండలి మంగళవారం ప్రకటన విడుదల చేసింది. మూడేళ్ల లా డిగ్రీ కోర్సుకు సంబంధించి అర్హత పరీక్షను జులై 21న నిర్వహించేందుకు నిర్ణయించింది. దీనితోపాటు ఐదేళ్ల కోర్సుకు కూడా అదేరోజు జరగనుంది. అలాగే పీజీఎల్‌సెట్(ఎల్ఎల్ఎం) పరీక్ష జులై 22న జరగనుంది. బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్‌ను జులై 26,27 తేదీల్లో, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ జులై 27, 28 తేదీల్లో పరీక్ష జరగనుంది. అంతేకాకుండా, పీజీ అర్హతా పరీక్ష పీజీఈసెట్‌ను జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు జరపునున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed