- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రభుత్వ ఆఫీసుల్లో మొబైల్ వాడకాన్ని నియంత్రించండి: హైకోర్టు ఆదేశాలు
చెన్నై: మద్రాసు హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు మొబైల్ ఫోన్లు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఫోన్లు వాడటం వల్ల కార్యనిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఓ వ్యక్తి అతిగా మొబైల్ వాడుతున్నారనే కారణంతో తనను సస్పెండ్ చేశారని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. 'ఆఫీసుల్లో ఫోన్ వినియోగం ఇతర కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకోవాలి. అత్యవసరమైతే కాల్స్ మాట్లాడాలి. లేదంటే సైలెంట్ లేదా వైబ్రేషన్ మోడ్లో ఉంచాలి. వీలైతే స్విచాఫ్ చేయాలి' అని కోర్టు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేలా విధానాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది.