ఒకే చోట పదుల సంఖ్యలో ప్రమాదాలు.. పట్టించుకోని ఆర్అండ్‌బీ అధికారులు

by Jakkula.Mamatha |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామపురం గ్రామంలో వాహనదారులకు వర్షాలు వస్తే చాలు ప్రమాదాలకు ఆహ్వానం పలికినట్లే.

ఒకే చోట పదుల సంఖ్యలో ప్రమాదాలు.. పట్టించుకోని ఆర్అండ్‌బీ అధికారులు
X

దిశ, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామపురం గ్రామంలో వాహనదారులకు వర్షాలు వస్తే చాలు ప్రమాదాలకు ఆహ్వానం పలికినట్లే. ఒకే ప్రాంతంలో అనేక సార్లు ప్రమాదాల పరంపర కొనసాగుతున్న ఆర్అండ్‌బి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు తూ తూ మంత్రంగా ఫ్యాచ్ పనులతో సరిపెట్టుకుంటున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి పటిష్టమైన రోడ్డు నిర్మించి ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజానీకం ఈ ప్రకటనలో తెలిపారు.

Next Story