మూగ మహిళపై దారుణం.. ఏపీ నుంచి కరీంనగర్‌కు తీసుకవచ్చి 40 రోజులు అలా..

by Dishanational2 |
మూగ మహిళపై దారుణం.. ఏపీ నుంచి కరీంనగర్‌కు తీసుకవచ్చి  40 రోజులు అలా..
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా, దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు. మూగ మహిళను కొందరు వ్యక్తులు బంధించి ఆత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని మచీలిపట్నంకు చెందిన మహిళను కొందరు వ్యక్తులు కరీంనగర్‌కు తీసుకవచ్చి దారుణానికి ఒడిగట్టారు. మూగ అమ్మాయి అని కూడా చూడకుండా ఓ చీకటి గదిలో బంధించి 40 రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తితే.. వంట పనిచేస్తూ ఓ మహిళ జీవనం సాగిస్తుంది. అయితే కొందరు వ్యక్తులు అమ్మాయికి మాయమాటలు చెప్పి తెలంగాణకు తీసుకవచ్చారు. అనంతరం ఆమెను బంధించి చిత్ర హింసలు పెట్టారు. ఈ ఘటన కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై విచారించిన కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed