టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా రాఖీ బేబీ.. 'కోబ్రా' మూవీ కోసం పెంచేసింది!

by Disha Web Desk 12 |
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా రాఖీ బేబీ.. కోబ్రా మూవీ కోసం పెంచేసింది!
X

దిశ, సినిమా: 'కేజీఎఫ్' మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీనిధి.. ప్రస్తుతం కోలీవుడ్‌లో దర్శనమిచ్చింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న 'కోబ్రా' సినిమాలో విక్రమ్‌తో జతకట్టనుంది. అయితే ఈ చిత్రం కోసం ముద్దుగుమ్మ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. 'కేజీఎఫ్' సినిమాకు రూ. 3 కోట్లు తీసుకున్న రాఖీ బేబీ.. ఆ చిత్రం భారీ సంచలనం సృష్టించడంతో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమాకు ఏకంగా ఆరు నుంచి ఏడు కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.


Next Story