రాష్ట్ర సెకండరీ బోర్డు ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2026-03-31 14:54:26  IST  )

రాజస్థాన్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 12వ తరగతి ఫలితాలను నేడు విడుదల చేసింది.

రాష్ట్ర సెకండరీ బోర్డు ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (RBSE) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 12వ తరగతి ఫలితాలను మార్చి 31వ తేదీ ఉదయం 10 గంటలకు అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఒక ప్రత్యేక పత్రికా సమావేశంలో ఈ ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్ rajeduboard.rajasthan.gov.in లో చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 97.20% గా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే విద్యార్థుల అద్భుత ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఫలితాలతో పాటు వివిధ విభాగాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థుల జాబితాను కూడా బోర్డు విడుదల చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 12 నుండి మార్చి 11 వరకు రాజస్థాన్‌లోని సుమారు 139 పరీక్షా కేంద్రాలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగాయి. నిబంధనల ప్రకారం.. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ.. మొత్తం మీద కనీసం 33 శాతం మార్కులు సాధించి ఉత్తీర్ణత పొందాల్సి ఉంటుంది. సబ్జెక్టులలో తప్పిన విద్యార్థులకు బోర్డు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుంది. వీటికి సంబంధించిన షెడ్యూల్, దరఖాస్తు తేదీలను బోర్డు త్వరలోనే ప్రకటిస్తుంది.

Next Story