Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!

by Kodari Anjali |

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది.

Today Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. అలాగే డే టైమ్‌లో ఎండ బాగానే ఉంటుంది. తెలంగాణ, ఏపీలో వాతావరణంలో మార్పులు తొందరగానే చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం ఎండగా అనిపించినా.. సాయంత్రం అయ్యే సరికి 5 గంటల వరకు చలి గాలులు మొదలవుతున్నాయి. గాలి కదలిక అధికంగా ఉంటుంది. సాపేక్ష తేమ 27 శాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఎక్కడా కూడా వానలు పడే చాన్స్‌లు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. క్రమంగా రాత్రివేళ ఏపీలో చలి పెరుగుతుందని తెలిపింది.

ఉదయం 8:00 AM నుంచి 12:00 PM వరకు, కొంచెం మబ్బులు ఉంటాయి మరియు తేలికపాటి చల్లగాలి ఉంటుంది. మధ్యాహ్నం 12:00 PM నుంచి 4:00 PM వరకు గరిష్ట ఉష్ణోగ్రత 31°C వరకు చేరవచ్చు. సాయంత్రం 4:00 PM నుంచి 8:00 PM వరకు ఉష్ణోగ్రతలు 25°C వరకు తగ్గుతాయని నిపుణులు వెల్లడించారు.

హైద్రాబాద్‌లో ఉష్ణోగ్రత గమనించినట్లైతే ... గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలు ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 29 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం..28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

వరంగల్ ఉష్ణోగ్రత గమనించినట్లైతే.. మాగ్జిమం 28 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.

Next Story