కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు చాలు: సీఎం యోగి ధ్వజం

by Web Desk |
కాంగ్రెస్‌ను నాశనం చేయడానికి ఆ అన్నాచెల్లెళ్లు చాలు: సీఎం యోగి ధ్వజం
X

లక్నో: ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాహుల్, ప్రియాంకాలపై ధ్వజమెత్తారు. అన్నాచెల్లెల్లు ఇద్దరు పార్టీని నాశనం చేయడానికి సరిపోతారని విమర్శించారు. సోమవారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అన్నాచెల్లెల్లు కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి సరిపోతారు. ఇంకెవరు అవసరం లేదు. నేను ఇప్పటికే ఉత్తరాఖండ్ వాసులకు ఈ విషయం చెప్పాను. మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పై ఎందుకు భారం మోపుతున్నారని ప్రశ్నించాను' అని అన్నారు. అంతకుముందు కూడా ఉత్తరాఖండ్ ర్యాలీలో యోగీ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పూర్తిగా మునిగిపోయిందని, ఏమైనా ఉంటే రాహుల్, ప్రియాంకాలు మరింత కిందకి నెడుతారని అన్నారు. ప్రధాని మోడీ ముస్లిం మహిళలకు అండగా ఉన్నారని చెప్పారు. ఈ వ్యవస్థ భారత రాజ్యాంగం ద్వారా నడుస్తుందని, ఇస్లాం చట్టాల ద్వారా కాదని చెప్పగలమన్నారు. తాలిబన్ ఆలోచనలు కలిగి ఉన్నవారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. నూతన భారత్‌లో అభివృద్ది అందరికి సమానంగా ఉంటుందని తెలిపారు. గతంలో చేసిన 80 వర్సెస్ 20 వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. 80 శాతం అభివృద్ధి తిరిగి కోరుకునే వారని, 20 శాతం అన్నింటిని వ్యతిరేకించే వారని చెప్పారు.



Next Story

Most Viewed