PV Sindhu: సెమీస్‌లో పోరాడి ఓడిన పీవీ సింధు

by Disha Web Desk 2 |
PV Sindhu: సెమీస్‌లో పోరాడి ఓడిన పీవీ సింధు
X

దిశ, వెబ్‌డెస్క్: కొరియా ఓపెన్‌ వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. దక్షిణ కొరియాకు చెందిన అన్ సియోంగ్‌ చేతిలో సింధు సెమీ ఫైనల్‌లో ఓడిపోయింది. పామా స్టేడియంలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సియోంగ్ దుసుకుపోయింది. దీనికి ముందు గేమ్‌లో సింధుకు చిన్న ఆవకాశం కూడా ఇవ్వలేదు. వరుస గేమ్‌లలో ఆధిపత్యం చూపిన సియోంగ్‌ 21-14, 21-17తో సింధును ఓడించింది. దీంతో తెలుగు తేజం సింధుకు భారీ దెబ్బ పడింది.

అయితే 20 ఏళ్ల సియోంగ్‌ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. కాగా అంతకుముందు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సింధు 21 –10, 21–16తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)ను ఓడించిన సంగతి తెలిసిందే. బుసానన్‌తో ఆడిన 17వ సారి విజయం సాధించింది. కానీ, సెమీస్‌లో మాత్రం తన బెస్ట్‌ని ఇవ్వడానికి చాలా ప్రయత్నంచింది. ఆరంభం నుంచే వెనుకబడ్డ సింధు చివరికి ఓటమి పాలైంది.


Next Story

Most Viewed