- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గోవా, మణిపూర్లో వారే సీఎంలు!

న్యూఢిల్లీ: గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అంతకుముందున్న సీఎంలకే పట్టం కట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఈ విషయమై ప్రధాని నివాసంలో బుధవారం చర్చలు జరిగినట్లు వెల్లడించారు. దీంతో మరోసారి గోవాకు ప్రమోద్ సావంత్, మణిపూర్కు బిరేన్ సింగ్ మరోసారి ముఖ్యమంత్రులు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ప్రమాణ స్వీకారాలు హోళీ తర్వాత చేపట్టనున్నట్లు పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, వీటిలో ఉత్తరప్రదేశ్కు సీఎంగా యోగీ ఆదిత్యనాథ్ మరోసారి అధికారం చేపట్టనున్న సంగతి తెలిసిందే. గోవాలో అత్యధిక సీట్లు గెలిచిన పార్టీగా అవతరించిన బీజేపీకి స్వతంత్రులు, స్థానిక పార్టీల మద్దతుతో మరోసారి అధికారంలోకి రానుంది. అంతేకాకుండా మణిపూర్ లో 32 స్థానాలు గెలుపొందిన బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే తాజాగా ఆయా రాష్ట్రాల మాజీ సీఎంలు మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.