తహశీల్దార్ కార్యాలయం ముందు నిరుపేదల ధర్నా

by Disha Web Desk 12 |
తహశీల్దార్ కార్యాలయం ముందు నిరుపేదల ధర్నా
X

దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలోని 298 సర్వే నెంబర్ లో 1984,1994, 2016 సంవత్సరంలో మూడు దఫాలు రెవెన్యూ అధికారులు సర్వే చేయించి.. సుమారు 300 మంది నిరుపేద లబ్ధిదారులకు పట్టాలు సర్టిఫికెట్లు అందించి లే అవుట్ చూపించారు. కొంత మంది నిరుపేదలు కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు నిరుపేద లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టుకున్నారు.

రెవెన్యూ అధికారులు నిర్మాణ పనులు ఆపాలని లబ్ధిదారులకు సూచించారు. దీంతో లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు ఆపాలని ఇబ్బందులకు గురి చేస్తున్నరంటూ.. నిరసిస్తూ బుధవారం తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం స్థానిక తహశీల్దార్ రాజేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. తహశీల్దార్ మాట్లాడుతూ.. పై అధికారులకు సమస్యను వివరించి తగిన న్యాయం చేస్తానని బాదితులకు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed