బార్డర్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. ఐదు రోజుల్లోనే ఇన్ని క్వింటాళ్లా..!

by Disha Web Desk 19 |
బార్డర్‌లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత.. ఐదు రోజుల్లోనే ఇన్ని క్వింటాళ్లా..!
X

దిశ, జహీరాబాద్: అక్రమంగా రాష్ట్ర సరిహద్దుల గుండా గుజరాత్‌కు తరలిస్తున్న 290 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని చిరాగ్ పల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. దీంతో కేవలం ఐదు రోజుల్లోనే మూడుసార్లు దాడులు చేసి 629 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నమ్మదగిన సమాచారం మేరకు డీఎస్పీ శంకర్ రాజు ఆదేశానుసారం పోలీస్ సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు కలిసి మాడిగి శివారులోని ఆర్టీవో చెక్ పోస్ట్ సమీపంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. కాగా, 12 గంటల సమయంలో జహీరాబాద్ వైపునుండి కర్ణాటక వైపు వెళ్తున్న లారీ అనుమానాస్పదంగా ఉండటంతో ఆపి తనిఖీ చేశారు. ఈ లారీలో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. బియ్యా్న్ని, లారీని సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌, యజమాని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కాశీనాథ్ తెలిపారు.



Next Story

Most Viewed