సెలున్ ముసుగులో వ్యబిచారం.. పోలీసులు సడెన్ ఎంట్రీ

by Dishafeatures2 |
సెలున్ ముసుగులో వ్యబిచారం.. పోలీసులు సడెన్ ఎంట్రీ
X

దిశ,వెబ్ డెస్క్: త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో చాలా మంది అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇదే దారిలో నడుస్తున్న కొందరు వ్యక్తులను ఎస్‌ఓటీ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రాధిక చౌరస్తా సమీపంలో సెలూన్‌ ముసుగులో(ప్యారీస్‌ సెలూన్‌ అండ్‌ స్పా) వ్యబిచారం సాగిస్తున్నారు. అమాయక మహిళలను మాయ మాటలతో మభ్యపెట్టి వ్యబిచారంలోకి దించుతున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు స్పాపై మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో మసాజ్‌ సెంటర్‌ను నడుపుతున్న జంపాల శివ, కొలిపాక నవీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed