గమ్యం చేరాలంటే ఇలా చేయాలి! రోడ్డు ప్రమాదాలపై పోలీసుల వినూత్న ప్రచారం..

by Disha Web Desk 19 |
గమ్యం చేరాలంటే ఇలా చేయాలి! రోడ్డు ప్రమాదాలపై పోలీసుల వినూత్న ప్రచారం..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న.. అవగాహన కల్పించిన ఏ మాత్రం తగ్గడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, నిర్లక్ష్యం వల్ల వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. ఈ క్రమంలో మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడంపై పోలీసులు సందేశాత్మకంగా ట్విట్టర్ వేదికగా అవగాహన కల్పిస్తున్నారు. '' మీ జీవితం విలువ ఒక ఫోన్ కాలో, ఒక మేసేజో కాదు.. బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకండి.'' అంటూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ఓ వ్యక్తి వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి మొబైల్ వినియోగిస్తున్నారు. మరో వ్యక్తి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నారు. దీనికి బైక్ పక్కన ఆపి ఫోన్ మాట్లాడితే గమ్యాన్ని చేరుకుంటారని.. లేకపోతే గమ్యం చేరకముందే జీవితాన్ని ముగించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ మీమ్ తయారు చేసి పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్ల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రైవింగ్‌లో హెడ్ ఫోన్స్ వాడుతున్నారా..! సీపీ స్టీఫెన్ రవీంద్ర కీలక సూచన





Next Story