మురిసిపోతున్న ఆ పోలీసులు.. 32 ఏళ్ల నిరీక్షణకు తెర..

by Dishafeatures2 |
మురిసిపోతున్న ఆ పోలీసులు.. 32 ఏళ్ల నిరీక్షణకు తెర..
X

దిశ, లోకేశ్వరం: 32 ఏళ్ల సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న పోలీసుల కల ఎట్టకేలకు పూర్తయింది. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న ఆ పోలీసుల నిరీక్షణకు తెరపడింది. 1990 బ్యాచ్ పోలీసులను హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం సాయంత్రం పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో బాసర జోన్‌లోని దాదాపు 200 కు పైగా 1990 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుళ్ళకు పదోన్నతి లభించింది. వీరి పదోన్నతి నిరీక్షణ గురించి దిశ దినపత్రికలో వరుస కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించి వీరికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, పలువురు పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు దిశ ప్రతినిధికి ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.

దిశ దిన పత్రికలో వరుస కథనాలు..

వీరితో పాటు 1990లో వివిధ శాఖల్లో ఉద్యోగంలో చేరిన వారు ప్రస్తుతం రెండు, మూడు ప్రమోషన్లు పొంది ఉన్నత పదవుల్లో ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ పోలీసుల ఆవేదనను తెలుపుతూ దిశ దిన పత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. అలాగే పలువురు పోలీసులు కోర్టుకు సైతం వెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడాన్ని గుర్తు చేస్తూ దిశ దినపత్రికలో కథనాలు రావడంతో కోర్టుతో పాటు ప్రభుత్వం స్పందించిందని ఆ పోలీసులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబరాలు చేసుకుంటున్న పోలీసులు..

పదోన్నతి పొందిన పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్లలో స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనా వారి నిరీక్షణకు తెర పడడం సంతోషదాయకం.

Next Story

Most Viewed