ప్రధాని నిత్యకృత్యాలు ఇవే.. రాహుల్ గాంధీ ట్వీట్

by Disha Web Desk 12 |
ప్రధాని నిత్యకృత్యాలు ఇవే.. రాహుల్ గాంధీ ట్వీట్
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇంధన ధరల పెంపు, రైతులు నిస్సహాయులుగా చేయడం, ఉద్యోగాలు ఉపాధి కల్పన కలగానే మిగల్చడం మోడీకి నిత్యకృత్యం అయ్యాయని అన్నారు. రోజ్ సుబాకీబాత్ పేరుతో ప్రస్తుత సమస్యలపై ఆయన ట్వీట్ చేశారు. ప్రధాని రోజు వారి జాబితా ఇంధన ధరలను ఎంత పెంచాలి. ప్రజల ఖర్చులపై చర్చలను ఎలా ఆపాలి. యువతకు ఉద్యోగాల పేరిట కలలుగా మిగల్చడం. ఏ ప్రభుత్వ రంగ సంస్థను విక్రయించాలి. రైతులను నిస్సహాయులుగా మార్చడం ఎలా' అంటూ హిందీలో ట్వీట్ చేశారు. కాగా బుధవారం కూడా వరుసగా ఇంధన ధరలు పెరిగాయి. గత తొమ్మిది రోజుల్లో ఏకంగా లీటర్‌పై రూ.5.60 పైసలు పెరగడం గమనార్హం.

Next Story

Most Viewed