- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీహార్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి.. రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
బీహార్ నలందా జిల్లా శీతల మాత ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మహిళలు మృతి. ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: బీహార్లోని నలందా జిల్లా మఘ్రా గ్రామంలో ఉన్న ప్రముఖ దేవాలయం అయిన శీతల మాత ఆలయం (Shitala Mata Temple)లో తొక్కిసలాట జరిగిని ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనతో యావత్ రాష్ట్రం ఉలిక్కిపడింది. చైత్ర మాసం చివరి మంగళవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో భక్తులు ఊపిరి ఆడక కిందపడిపోయారు. ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారంతా మహిళలేనని అధికారులు ధ్రువీకరించారు. మరో 12 మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
అలాగే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ దారుణ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అండగా ఉండేందుకు పీఎంఆర్ఎఫ్ (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తోందని, భక్తుల రద్దీని నియంత్రించేందుకు అదనపు బలగాలను మోహరించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.






