బిగ్ బ్రేకింగ్: ఘోర విమాన ప్రమాదం.. 130 మంది దుర్మరణం

by Disha Web Desk 2 |
బిగ్ బ్రేకింగ్: ఘోర విమాన ప్రమాదం.. 130 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్యాసింజర్ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం నైరుతి చైనాలోని వూహో సిటీ సమీపంలోని పర్వతశ్రేణుల్లో కున్మింగ్ నుంచి గ్వాంగో సిటీ వెళ్తుండగా సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, విమాన ప్రయాణాలకు సంబంధించి చైనా అత్యంత భద్రతా ప్రమాణాలు కలిగి ఉంది. ఆ దేశంలో చివరి విమాన ప్రమాదం 2010లో జరిగింది.

Next Story

Most Viewed