- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'కాకినాడలో మమ్మల్ని ఎవరూ ఏం పీకలేరు'
దిశ, ఏపీబ్యూరో: కాకినాడలో మమ్మల్ని ఒక వెంట్రుక గాని, ఈక గాని పీకలేరు అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సభలు పెట్టడం, ప్యాకేజీ మాట్లాడుకోవడం పవన్కు అలవాటే అని అన్నారు. పవన్ కల్యాణ్ పెట్టిన ఆవిర్భావ సభ జనసేన ప్రమోషన్ కోసం కాదన్నారు. పార్టీని అమ్ముకోవడానికి పెట్టుకున్న సభ అని ఎద్దేవా చేశారు. ''నా సభకు ఇంత మంది హాజరయ్యారు.. నాకెంత ప్యాకేజీ ఇస్తారు'' అని బేరం కుదుర్చుకోవడం కోసమే ఈ సభ పెట్టారని ఆయన సెటైర్లు వేశారు .సినిమాలు వేరు, రాజకీయాలు వేరని పవన్ గుర్తించాలన్నారు.
దమ్ముంటే పవన్ ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేశారు.''జనసేనలో కొందరు లక్షలు ఖర్చు చేస్తున్నారు.. మీరెన్ని లక్షలు ఖర్చు చేసినా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని తాకట్టు పెడతారు' అని అన్నారు. టీడీపీతో పొత్తుకెళ్తే పవన్కే నష్టమని సూచించారు. నా జోలికి వస్తే క్షమించేది లేదన్నారు. మీ నాయకులు, కార్యకర్తలు మా ఇంటిపైకి వస్తే చేతులు ముడుచుకు కూర్చోనని ఆయన హెచ్చరించారు.