- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
దిశ, అమీన్పూర్: అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో 10, 11, 12, 21, 22 వార్డుల పరిధిలో కోటి 84 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రతి వాడ వాడలో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. అమీన్ పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి లో అగ్రగామిగా నిలపాలని, అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.