రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం

by Kema Shiva Kumar |

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ హౌస్ అనెక్స్‌ (Parliament House Annex)లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్ హౌస్ అనెక్స్‌ (Parliament House Annex)లో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రభుత్వం తన శాసనపరమైన అజెండాను వివరించడంతో పాటు, సభ సజావుగా సాగేలా చూడాలని అన్ని పార్టీల నేతలను కోరనుంది. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi's Murmu) ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంటరీ చరిత్రలో అరుదుగా, ఈ సారి కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ఆమె చేసే ప్రసంగం అనంతరం, ఫిబ్రవరి 13 వరకు మొదటి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది.

కాగా, ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా విక్షిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు (2025), సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ (2025) వంటి 9 బిల్లులు ప్రస్తుతం లోక్‌సభ పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, ‘గ్రామీణ్’ (GRAMIN) చట్టం వంటి అంశాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నిరసనలు తెలిపే అవకాశం ఉండటంతో, సమావేశాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story