ఆ అవార్డు ఎందుకిచ్చారో అర్థం కాలేదు.. పంకజ్ త్రిపాఠి

by Disha Web Desk 2 |
ఆ అవార్డు ఎందుకిచ్చారో అర్థం కాలేదు.. పంకజ్ త్రిపాఠి
X

దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి దుబాయ్‌లో జరిగిన 'ఐఐఎఫ్ఏ 2022'లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆవార్డు ఏ సినిమాలో పాత్రకు లభించిందో అర్థంకాక గందరగోళానికి గురైనట్లు తెలిపాడు. ఈ మేరకు 2020లో వచ్చిన 'లూడో', 2021లో వచ్చిన '83' రెండు సినిమాలకు అవార్డులు లభించాయని, ఈ రెండింటిలోనూ తాను కీలక పాత్రలు పోషించినట్లు తెలిపాడు. 'నేను వేదికపైకి వెళ్లగానే లూడోలో 'సత్తు' పాత్రకుగానూ అవార్డు వచ్చిందని కృతి సనన్ ప్రకటించింది. అయితే అప్పటికే ఆందోళనగా ఉన్న నేను ఏ చిత్రానికి ఈ విజయం దక్కిందో అర్థం చేసుకోలేక పోయాను. ఏది ఏమైనా ఇదొక అద్భుతమైన, మరపురాని క్షణం. వేదికపై ప్రసంగంలో ఏమి చెప్పాలో తెలియలేదు. నిర్మాతలు, దర్శకులు, సహానటులతోపాటు అనురాగ్ దాదాకి, ప్రేక్షకుల ప్రేమకు కృతజ్ఞతలు' అంటూ చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed