చెట్లను నరికినందుకు విద్యుత్ సిబ్బందికీ నోటీసులు

by Disha Web Desk 13 |
చెట్లను నరికినందుకు విద్యుత్ సిబ్బందికీ నోటీసులు
X

దిశ, కుబీర్: కుబీరు మండలంలోని నిగ్వ గ్రామ పంచాయతీలో విద్యుత్ శాఖ సిబ్బంది హరితహారంలో నాటిన చెట్లను నరికి వేశారు. ఇందుకుగాను పంచాయతీ అధికారులు జరిమానా వేస్తూ.. అధికారులకు నోటీసులు జారీ చేశారు. బస్టాండ్ నుంచి పాఠశాల వరకు ఉన్న హరితహారం పెంచిన 38 చెట్లను నరికివేసిన అందుకుగాను ఒక్కో చెట్టు కు రెండు వేల రూపాయల చొప్పున 76000₹ చెల్లించాలి నోటీసులో పేర్కొన్నారు. సంబంధిత శాఖ సిబ్బంది కనీసం పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మూడు రోజుల్లో జరిమానా చెల్లించాలన్నారు. చెట్లపై నుండి విద్యుత్ సరఫరా చేసే తీగలు ఉండడం తో నరక వలసి వచ్చిందని సిబ్బంది అంటున్నారు.





Next Story

Most Viewed