- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబ సభ్యుల చేతిలో యజమాని హత్య
by Batti.Sumithra |
మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఇంటి యజమానిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేసిన సంఘటన నిజమాబాద్ జిల్లా మోపాల్ మండలంలో బుధవారం వెలుగుచూసింది.

X
దిశ, నిజామాబాద్ అర్బన్ : మద్యం తాగి వేధిస్తున్నాడనే నెపంతో ఇంటి యజమానిని కుటుంబీలకులంతా కలిసి హత్య చేసిన సంఘటన నిజమాబాద్ జిల్లా మోపాల్ మండలంలో బుధవారం వెలుగుచూసింది. భార్య, కొడుకు, కోడలి చేతిలోనే హత్యకు గురికావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోపాల్ మండలంలోని అమ్రాబాద్ జీపీ పరిధిలోని కోక్యా నాయక్ తండాలో బానోత్ హరి (50) మద్యంకు బానిస అయ్యాడు. అయితే తాగిన మత్తులో తరచూ తమను వేధిస్తున్నాడనే నెపంలో ఆయన కుటుంబీకులంతా కలిసి మంగళవారం రాత్రి బానోత్ హరి గొంతు పిసికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు.
Next Story






