భూమి కొన్నంత మాత్రాన పౌరుడు కాదు : కలకత్తా హైకోర్టు

by Muthe.Rajitha |

పౌరసత్వానికి (Citizenship), ఆస్తి హక్కులకు (Property Rights) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ కలకత్తా హైకోర్టు అత్యంత సంచలన తీర్పును వెలువరించింది.

భూమి కొన్నంత మాత్రాన పౌరుడు కాదు : కలకత్తా హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాటు (Illegal Encroachment) ఆరోపణలతో అరెస్టయిన నసీర్ మొల్లా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా పౌరసత్వానికి (Citizenship), ఆస్తి హక్కులకు (Property Rights) మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టం చేస్తూ న్యాయస్థానం అత్యంత సంచలన తీర్పును వెలువరించింది.

పిటిషనర్ వాదన.. కోర్టు తిరస్కరణ

తాను పశ్చిమ బెంగాల్‌లో చట్టబద్ధంగా భూమిని కొనుగోలు చేశానని, అందువల్ల తాను భారతదేశ పౌరుడినేనంటూ నసీర్ మొల్లా కోర్టులో వాదించాడు. తన అరెస్టు చట్టవిరుద్ధమని పేర్కొన్నాడు. అయితే, అతని పౌరసత్వ నిరూపణకు కేవలం భూమి పత్రాలు సరిపోవని పేర్కొంటూ హైకోర్టు అతని వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. ఈ సందర్భంగా కలకత్తా హైకోర్టు ఒక ముఖ్యమైన చట్టపరమైన అంశాన్ని ప్రస్తావించింది. భారతదేశంలో విదేశీయులు (Foreigners) కూడా కొన్ని నిబంధనలకు లోబడి ఆస్తులు, భూములను కొనుగోలు చేసే అవకాశం ఉందని, అయితే కేవలం ఇక్కడ ఆస్తి సంపాదించినంత మాత్రాన వారు భారతీయ పౌరులుగా మారిపోరని కోర్టు స్పష్టం చేసింది. భూమి కలిగి ఉండటం అనేది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రాథమిక ఆధారం కాబోదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. అక్రమ చొరబాటుదారులపై బెంగాల్ పోలీసులు చట్టప్రకారం చేసిన అరెస్టును న్యాయస్థానం సమర్థించింది. సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసలు, చొరబాట్లు, తప్పుడు పత్రాలతో భూములు కొనుగోలు చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో, కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Next Story