- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమరవీరుల త్యాగాలకు బీజేపీ సలాం.. ‘వికసిత్ తెలంగాణ’ నిర్మాణమే మా లక్ష్యం: కిషన్ రెడ్డి
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ ఉద్యమకారుల త్యాగాలను ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కిషన్ రెడ్డి స్మరించుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆవిర్భావ వెడుకలు జరిగాయి. ఈ ఉత్సవాలకు బీజేపీ కీలక నేతలు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల చారిత్రాత్మక పోరాటాన్ని, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, సామాజిక కార్యకర్తలు చేసిన అగణిత త్యాగాలను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల హక్కులు, ప్రాంతీయ అభివృద్ధి, అవకాశాలలో సమాన వాటా, వనరుల సాధన కోసం తెలంగాణ సమాజం సుదీర్ఘకాలం సాగించిన ఉద్యమాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కొనియాడారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, వారి త్యాగాలను గౌరవిస్తూ 'వికసిత్ తెలంగాణ' (అభివృద్ధి చెందిన తెలంగాణ) నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ అందించిన తిరుగులేని మద్దతును ఆయన గుర్తుచేశారు. పల్లెల్లో జరిగిన పోరాటాల నుంచి పార్లమెంట్ వేదికగా సాగిన పోరాటం వరకు.. రాజ్నాథ్ సింగ్, దివంగత నేత సుష్మా స్వరాజ్ వంటి అగ్రనేతల నాయకత్వంలో బీజేపీ నిరంతరం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా గట్టి నినాదం వినిపించిందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందని, భవిష్యత్తులోనూ ఆ ఆకాంక్షల నెరవేర్పు కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.






