- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
17 ఏండ్ల కల సాకారమవుతున్న వేళ.. ఆ స్టేడియం ప్రారంభం

దిశ, వైరా : వైరా మున్సిపాలిటీ పరిధిలోని రింగ్ రోడ్డు సమీపంలో ఎన్నో ఏళ్ళ నుండి షటిల్ క్రీడాకారుల సౌకర్యార్థం మినీ ఇండోర్ స్టేడియంని నిర్మించేందుకు అనేక సంవత్సరాలుగా అనేక దఫాలుగా వాయిదాలు పడుతూ సుమారు 85 లక్షల రూపాయల నిధులు ఖర్చుతో ఎట్టకేలకు ఇండోర్ స్టేడియం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర క్రీడల ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు రాములు నాయక్ తదితర నాయకులచే ప్రారంభం కానుంది.
మంత్రులకు సమస్యల స్వాగతం..
వందల ఏళ్ల చరిత్ర కలిగిన వైరా రిజర్వాయర్ గుట్ట వద్ద 2002 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో వైరా రిజర్వాయర్ వద్ద ఆధునీకరణకు శిలాఫలకం వేశారు. అనంతరం 2005లో ఖమ్మం పార్లమెంట్ సభ్యు రాలు కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రత్యేక చొరవతో సుమారు కోటి రూపాయల నిధులతో వైరా రిజర్వాయర్ వద్ద టూరిజం శాఖ ఆధ్వర్యంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రిజర్వాయర్ గుట్టలు వద్ద సెంట్రల్ లైటింగ్, బోటింగ్, ఫుట్ పాత్, చిల్డ్రన్ పార్క్ గ్రీనరీ, రెస్టారెంట్ పౌంటెన్, ఎంట్రీ ప్లాజా నిర్మించి వైరా రిజర్వాయర్ గుట్టల వద్ద పర్యాటక రంగం అభివృద్ధి చెందేలా చేశారు, అయితే మిషన్ భగీరథ నిర్మాణ పనుల్లో భాగంగా కొన్ని రోజులపాటు పర్యాటక కేంద్రానికి ఆటంకం కలగడంతో గతంలో నిర్మించిన నిర్మాణాలు తొలగించడం వల్ల గ్రీనరీ ఫుట్ పాత్ చిల్డ్రన్ పార్క్ వంటివి దెబ్బతినడంతో, తిరిగి పునరుద్ధరించ వలసిన అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంతో పర్యాటక రంగం పడకేసింది అని .నాడు పచ్చదనంతో కళకళలాడే పార్క్, నేడు కళతప్పి సందర్శకుల హడావుడి లేక నేడు బోసి పోయింది. ఫుట్ పాత్లు మొత్తం శిథిలావస్థకు చేరి నడవడానికి వీలు లేని విధంగా తయారు అయ్యాయి. అలాగే ఆహ్లాదం కోసం వైరా రిజర్వాయర్లో బోటింగ్కు వెళ్లే పర్యాటకుల కోసం, ఏర్పాటుచేసిన బోట్లు ఒడ్డుకు చేరి చెట్ల మధ్యలో శిథిలావస్థకు చేరి పోయినాయి. అలాగే రెస్టారెంటు మూతబడి వాటర్ ఫౌంటెన్ లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
మినీ ట్యాంక్ బండ్ పనులు అసంపూర్తి..
వైరా రిజర్వాయర్ ఆనకట్ట పై మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కొరకు సుమారు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల వరకు నిధులను వెచ్చించి మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కల, కలగానే మిగిలిపోయింది. ఆనకట్ట పై సోలార్ లైటింగ్ సిస్టం నేటికీ ఏర్పాటు కాకపోవడంతో విద్యుత్ కాంతులతో కళకళలాడాల్సిన రిజర్వాయర్ ఆనకట్ట వెలవెలబోతోంది. అధికారుల నిర్లక్ష్యమో, ప్రజాప్రతినిధుల సహాయసహకారాలు లేకపోవడంమో ఏమో కానీ వైరా రిజర్వాయర్ అభివృద్ధికి ఆమడ దూరంలోనే విసిరేసిన చందంగా ఉందని పలువురు పర్యాటకులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల మంత్రులు, ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని రిజర్వాయర్ను ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని ప్రజలు కోరుకుంటున్నారు.