యాదాద్రిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

by Disha Web Desk 12 |
యాదాద్రిలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీన స్వస్తివాచనం తో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 14 వ తేదీన అష్టోత్తర శత ఘటాభిషేకం తో ముగియనున్నాయి. ఆదివారం మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మత్స్యావతార అలంకారంలో సేవ పై నయనమనోహరంగా అలంకరించి వేదమంత్రాలు, వేదపారాయణలు మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.10వ తేదీన ఎదుర్కోలు‌,11న తిరుకల్యాణం,12 రదోత్సవం నిర్వహించనున్నారు.



Next Story

Most Viewed