ప్రధాని మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుంది: UAE రాయబారి సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

"ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఆగిపోతుంది" అని భారత్‌లో UAE రాయబారి హుస్సేన్ హాసన్ మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీ ఒక్క ఫోన్ చేస్తే యుద్ధం ఆగుతుంది: UAE రాయబారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను తొలగించే శక్తి కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)కి మాత్రమే ఉందని భారత్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాయబారి అబ్దుల్ నజీర్ హుస్సేన్ అల్ జెనబీ (Abdul Nazir Hussein Al-Zenaby) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నేతలకు ప్రధాని మోడీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలని, ఈ యుద్ధం వెంటనే ఆగిపోయే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల నేతల్లోనే కాకుండా, అక్కడి ప్రజలు, వ్యాపార వర్గాల్లోనూ మోడీ పట్ల అపారమైన గౌరవం ఉందని ఆయన గుర్తు చేశారు.

ఈ యుద్ధం విషయంలో UAE తన స్పష్టమైన వైఖరిని ప్రకటించింది. తాము నేరుగా యుద్ధంలోకి దిగే ఆలోచన లేదని, అలాగే తమ భూభాగాన్ని (UAEని) ఏ దేశం కూడా మరొక దేశంపై దాడి చేయడానికి 'లాంచింగ్ ప్యాడ్'గా వాడుకోవడానికి అంగీకరించబోమని రాయబారి స్పష్టం చేశారు. ఇరాన్ తమ పొరుగు దేశమని, అదే సమయంలో ఇజ్రాయెల్ తమ మిత్రపక్షమని పేర్కొన్న ఆయన.. ఈ రెండు దేశాలతోనూ చర్చలు జరిపే సత్తా తమకు ఉందని వెల్లడించారు.

శాంతి స్థాపన కోసం అంతర్జాతీయ సమాజం చేస్తున్న ప్రయత్నాల్లో భారత్ వంటి శక్తివంతమైన దేశాల సహకారం ఎంతో అవసరమని UAE రాయబారి అభిప్రాయపడ్డారు. ప్రపంచ శాంతి కోసం ప్రధాని మోడీ చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Next Story