వేంపల్లి గ్రామ శివారులో లారీ బోల్తా.. ఒకరు మృతి

by Jakkula.Mamatha |

ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం ఉదయం లారీ బోల్తా పడింది.

వేంపల్లి గ్రామ శివారులో లారీ బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, ముప్కాల్: ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం ఉదయం లారీ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయాలతో బయటపడ్డారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు సంత్రా పండ్ల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్‌ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Next Story