కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవు.. లోక్‌సభలో కేంద్రమంత్రి

by Vinod kumar |

న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ - No Proposals On Creation Of New States: Centre Informs Lok Sabha

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు లేవు.. లోక్‌సభలో కేంద్రమంత్రి
X

న్యూఢిల్లీ: కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి నిత్యానంద్ రాయ్ కీలక విషయాన్ని వెల్లడించారు. దేశంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదని లేదని తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అదూర్ ప్రకాష్ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అభ్యర్థనలు ప్రభుత్వానికి అందాయా అనే ప్రశ్నకు మంగళవారం కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి దేశంలో ఎలాంటి నూతన రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు లేవని చెప్పారు. దేశంలో వామపక్ష ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందని నిత్యానంద్ రాయ్ సభకు తెలియజేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) రాష్ట్ర భద్రతా సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల భద్రతా సిబ్బందికి శిక్షణ ఇస్తోందని ఆయన తెలిపారు.

Next Story