కొవిడ్ వ్యాక్సిన్‌పై అంత చార్జ్ చేయొచ్చు: ప్రభుత్వం

by Dishafeatures2 |
కొవిడ్ వ్యాక్సిన్‌పై అంత చార్జ్ చేయొచ్చు: ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాల్లో వ్యాక్సినేషన్ ఒకటి. నెవ్వర్ బిఫోర్ అనేలా భారీ స్థాయిలో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్‌ను చేపట్టింది. దాదాపు దేశ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ డోస్ అందించింది. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ (ప్రికాషినరి) డోస్ వార్తల్లో నిలుస్తోంది. ప్రజలకు కరోనా నుంచి రక్షణ కోసం బూస్టర్ డోస్ అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి దేశంలో ప్రికాషినరీ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం కానున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి స్పందించారు. దేశంలో ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ప్రికాషినరీ డోస్‌ టీకాలు ఇదివరకు రెండు డోస్‌లను వాడిన వ్యాక్సిన్ ఒకటే అని, కాబట్టి ప్రజలు దీనికోసం కోవిన్ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. అయినప్పటికీ ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలు మాత్రం అత్యధికంగా రూ.150 సర్వీస్ చార్జీగా తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.


Next Story