అసెంబ్లీలో చర్చించాల్సిన సమస్యలే లేవు: ఎమ్మెల్యే గాదరి కిషోర్

by Disha Web Desk 12 |
అసెంబ్లీలో చర్చించాల్సిన సమస్యలే లేవు: ఎమ్మెల్యే గాదరి కిషోర్
X

దిశ,తుంగతుర్తి: అన్ని రంగాల్లో తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి పరంగా ముందుకు పోతున్న దృష్ట్యా సమస్యలనేవి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం లేదని శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ వెల్లడించారు. శనివారం ఆయన "దిశ" తో మాట్లాడారు. తాను గెలిచిన రెండు పర్యాయాలలో నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలన్నింటినీ పరిష్కరించానని స్పష్టం చేశారు. కొద్దిపాటి చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ముఖ్యంగా 2014 ముందు నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కారానికి నోచుకోక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తొలిసారి ప్రతి గ్రామానికి పర్యటించి ప్రజల ద్వారా సమస్యలన్నింటినీ తెలుసుకుని అంచెలంచెలుగా పరిష్కరించానని స్పష్టం చేశారు. ఎడారిలా ఉన్న తుంగతుర్తి ప్రాంతాన్ని కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశానని ఆ ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందని అన్నారు. విద్య, వైద్యం, విద్యుత్, రహదారులు, తదితర రంగాలన్ని ప్రజలకు చేరువయ్యాయని తెలిపారు.

Next Story

Most Viewed